లైవ్లో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా కంటతడి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్ గుప్తా .. ప్యానెల్ చర్చ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన ఆయన లైవ్లోనే కంటతడి పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనేక సర్వేలు భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించారు. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 361-401 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 131-166 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే భాజపా మెజారిటీ మార్క్ను దాటినా సర్వేలో అంచనా వేసిన సీట్లను మాత్రం గెలుచుకోలేకపోయింది. ”యాక్సిస్ మై ఇండియా గత 10 ఏళ్లుగా ఎగ్జిట్ పోల్స్ను నిర్వహిస్తోంది. రెండు లోక్సభ ఎన్నికలతో సహా మొత్తం 69 ఎన్నికలకు సర్వేలు చేశాం. మా అంచనాలు 65 సార్లు కరెక్ట్గా ఉన్నాయి’’ అని నిన్న ఓ వార్తా సంస్థతో ప్రదీప్ గుప్తా అన్నారు. కానీ.. ఈసారి సర్వేల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి సర్వేల ఫలితాలు తారుమారవుతుంటాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తప్పిన అంచనాలు
Related Posts
బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read moreభారత దేశ పారిశ్రామిక చరిత్రలో ముగిసిన రతన్ నావల్ టాటా శకం
అనారోగ్యంతో ముంబై బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో పారిశ్రామిక దిగ్గజం కన్నుమూతటాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త..ప్రభాతదర్శిని, (ముంబై-ప్రత్యేక ప్రతినిధి):భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక…
Read more