ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ-ప్రతినిధి): విజయదశమి సందర్బంగా పల్లమాలలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు శనివారం దర్శించుకున్నారు.ఈ సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారి నూతన కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లు యస్. సి. వి నాయుడుకి ఆలయ నిర్వాహకులు తెలియజేయగా, తన వంతు సహాయంగాపది లక్షలు రూపాయలు విరాళా న్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా కల్యాణ మండప నిర్మాణం పూర్తి అయ్యేవరకు సహాయ, సహకారాలు అందిస్థానని తెలియజేసారు.అనంతరం యువతకు భక్తి మార్గం గురించి యస్. సి. వి నాయుడు మార్గదర్శనం చేసారు.ఈ సందర్బంగా యస్. సి. వి నాయుడుతో సెల్ఫీల కోసం యువతపోటీ పడి తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుదర్శన్ నాయుడు, హరిబాబు నాయుడు, కన్నయ్య నాయుడు, ఎక్స్ యం. పి.టి. సి. వీర రాఘవులు, యూనిట్ ఇంచార్జ్ సురేష్, జి. మునస్వామి ఆచారి, వెంకటకృష్ణ, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.