ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి ):శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో రాహు కేతు పూజ చేసుకుని స్వామి అమ్మవార్ల , దర్శనార్థం హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర విచ్చేశారు. ఆమెకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.నందమూరి వసుంధరకి శ్రీకాళహస్తి ప్రాముఖ్యత కలిగిన కలంకారి చీరను బొజ్జల రిషితా రెడ్డి బహుకరించారు.