ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఎస్సై ఆర్. జయశేఖర్ లపై వేటు వేస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డిఐజి హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జూలై 7న ఆడుకోవడానికి వెళ్లిన బాలికను ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడి చేసి చంపేశారని, మృతదేహాన్ని కేసీ కెనాల్ లో పడేసినట్టు నంద్యాల ఎస్పీ అదిరాజ్ తెలిపారు. తమ పిల్లలు దొరికి పోతారనే భయంతో నిందితుల కుటుంబీకులు బాలిక మృత దేహానికి రాళ్లు కట్టి పుట్టిలో తీసుకెళ్లి కృష్ణా నదిలో పడేశారని వెల్లడించారు. ఇంకా ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రాబట్టడం జరుగుతుందని ఎస్పీ విలేఖరులకు తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐ లపై వేటు:డి.ఐ.జి. విజయారావు
Related Posts
సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్…
Read moreజాతీయ స్థాయి లో పతకాలు సాధించాలి : తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పతకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పతకాలుసాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్నులో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ…
Read more