ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా మేరకు మందులు వాడి త్వరగా కోలుకోవాలని తెలిపారు. గత ఆరు సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న యారం కృష్ణయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విజయవాడకు వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడలో ఒక లాడ్జిలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అందుబాటులో ఉన్న కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం ఇతర నాయకులు అత్యవసరంగా అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
యారం కృష్ణయ్యను పరామర్శించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
Related Posts
14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…
Read moreఅమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…
Read more