ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా మేరకు మందులు వాడి త్వరగా కోలుకోవాలని తెలిపారు. గత ఆరు సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న యారం కృష్ణయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విజయవాడకు వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడలో ఒక లాడ్జిలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అందుబాటులో ఉన్న కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం ఇతర నాయకులు అత్యవసరంగా అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.