పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నాటు. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మధ్యాహ్నం భోజనం పథకం మెనూ బోర్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున పిల్లలు ఆరోగ్య అలవాట్లను పాటించాలని సూచించారు. భోజనం ముందు తరువాత చేతులను శుభ్రపరుచు కోవాలని తెలిపారు. మెనూ ప్రకారం వంటలు తయారు చేసారా లేదా అని పరిశీలించడమే కాకుండా వడ్డించిన పదార్థాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్దులతో కలసి సహపంక్తి భోజనం చేసారు. రోజువారీ తయారు చేసే వంటలు గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ పాఠశాలలో తప్పక మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు. గుడ్డు, చిక్క, రాగి జావ తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరిశుభ్రమైన నీటితో వంటలు చేయాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం కనుక వంట దగ్గర, వడ్డించే దగ్గర, బోజనం చేయు ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రధానోపాద్యాయుడు పి.మహేశ్ బాబును ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సందర్భంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, మద్యాహ్న భోజన జిల్లా కో ఆర్డివీటర్లు కె.కృష్ణారావు, జి.చిన్నియ్య, మండల విద్యాశాఖ అధికారి పి.నాగరాజు, ఉప విద్యాశాఖాధికారి ఎన్. శ్రీనివాస్. బీమవరం ఎంఈఓ 2, సీఆర్పీలు అన్నపూర్ణ, వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలి
Related Posts
సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్…
Read moreజాతీయ స్థాయి లో పతకాలు సాధించాలి : తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పతకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పతకాలుసాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్నులో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ…
Read more