ప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి , మాజీ టౌన్ బ్యాంక్ వైస్ పులి రామచంద్రయ్య లు దేవి నవరాత్రుల సందర్బంగా స్థానిక భాస్కర పేట చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద వారికి గతంలో వున్న ఆర్థిక లావాదేవీల కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంది.దీంతో వారు అమ్మవారిని దర్శించుకుని వస్తున్న సమయంలో పరస్పరం వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.అయితే వారిద్దరూ గత ప్రభుత్వంలో ఇరువురు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ఉండడం విశేషం, ఈ సందర్భంలో వీరి ఆర్థిక లావాదేవీల పంచాయతీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి రావడం, వారి పంచాయతీ తీర్చలేక ఎవరికీ న్యాయం చేయలేకపోవడంతో పరస్పర వ్యక్తి గత దూషణలు, కోర్టుకేసులు జరుగుతున్నాయి. అటు పిమ్మట 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలోపార్థసారథి చేరారు.ఈ చేరికను ప్రస్తుత శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యఅనుచరులు తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం. ఈ నేపథ్యంలో భాస్కర పేట చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్దకు దర్శనం నిమిత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి వచ్చారు. ఈ సందర్భంలో అమ్మవారి గర్భాలయంలో కుటుంబ సమేతంగా ఉన్న మాజీ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పులి రామచంద్ర దంపతులు ఒకరికి ఒకరు ఎదురు పడడం అదేవిధంగా చామండేశ్వరి ఆలయ చైర్మన్ గా వైసీపీ నేత మాజీ కౌన్సిలర్ చల్లా జయరామయ్యను ఎన్నిక చేయడంలో ముత్యాల పార్థసారథి కీలకంగా వ్యవహరించారని అందుకు పులి రామచంద్రయ్య వర్గం ఆలయ చైర్మన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఉండడం, భాస్కర్ పేటలో కొంతకాలంగా వీరు ఇరువురు మధ్య వర్గ పోరు జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఒకప్పుడు రామలక్ష్మణులు,ఇప్పుడు దాయాదుల వలే కర్రలు,రాళ్లు, పోరకలు,పాదరక్షలతో పరస్పర దాడులు చేసుకొని పండుగ పర్వదినాన అమ్మవారి భక్తులు భయభ్రాంతులతో పరుగులు తీశారు.