ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): త్వరలో జరగనున్న ఎన్నికలలో బట్టలు కనుపూర్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీని తీసుకురావడం ద్వారా ఎంపీపీ గడ్డం అరుణమ్మ ప్రతిష్టను మరింత పెంచాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఓజిలి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్లకనుపూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మీ గ్రామం నుండి ఎంపీటీసీగా గెలుపొందిన మీ ఆడపడుచు అయిన గడ్డం అరుణమ్మను ఓజిలి ఎంపీపీగా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వాన్నిదేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఎంపీపీ అరుణమ్మ ప్రతిష్ట కు భంగం వాటిల్లేకుండా భట్లకనుపూరు గ్రామంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీని తీసుకురావాలని ఆయన కోరారు. గ్రామంలో కొందరు వైసీపీని అస్థిర పరిచేందుకు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ పార్టీ నాయకులు అవసరానికి ఉపయోగించుకొని తర్వాత పట్టించుకోరని ఒకర్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో నీటి సమస్య నెలకొన్నదని అన్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేయడంతో నీటి సమస్య నెలకు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో తండ్రి కొడుకులు ఎక్కడ పాదం పెట్టిన అక్కడ కరువు కాటకాలు ఏర్పడి తాగునీరు కూడా దొరకదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా రానున్న మరో ఐదేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం అరుణమ్మ, మండల ఉపాధ్యక్షురాలు మీనాక్షి, సర్పంచ్ ఉమామహేశ్వరి, వైసిపి యువ నాయకులు గడ్డం వెంకటరెడ్డి, జ్ఞాన ప్రసూనాంబ దేవస్థానం చైర్మన్ జయరామిరెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు హరినాద్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వైసిపి నాయకులు గురవయ్య, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, పిండుకూరు మధుసూదన్ రెడ్డి, ఎల్ల సురేష్ రెడ్డి, ముమ్మడి రామయ్య, ముని రాజారెడ్డి, వేణు రెడ్డి, మహేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామ పొలిమేర్ల నుండి వైసీపీ యువ నాయకుడు గుడ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తప్పెట్లు తాళాలతో ఊరేగింపుగా ప్రచారం నిర్వహించారు.
భట్లకనుపూరులో మెజార్టీని తెచ్చి… ఎంపీపీ ప్రతిష్టను పెంచాలి…ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కిలివేటి
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more