ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):మీడియా రంగంలో ఉత్తమ పాత్రికేయుడిగా దాదాపు దశబ్దం కాలంగా పైబడి నవసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తనదైన శైలిలో వార్తా కథనాలు రాస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యంగా కరోనా కాలంలో స్వచ్ఛందంగా ఎటువంటి లాభవేక్ష ఆశించకుండా సామాన్య జర్నలిస్టుగా మల్లాది ప్రసాదరావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను రాజస్థాన్ రాష్ట్ర జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ గుర్తించి మల్లాది ప్రసాదరావు కి జాతీయ ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందించారు. శుక్రవారం విజయవాడ హోటల్ ఐలాపురంలో జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ మీడియా రంగంలో సామాజిక సేవ చేస్తున్న పాత్రికేయులకు జాతీయ ఉత్తమ జర్నలిస్టుల అవార్డు పురస్కారాల ప్రదానోత్సవం ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె జలీల్ చేతుల మీదుగా మల్లాది ప్రసాదరావు కి జాతీయ ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రధానం చేశారు. జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ నాకు అవార్డు ప్రధానం చేసిన జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ వారికి, జర్నలిస్టుగా దశాబ్ద కాలంగా పైబడి నన్ను ప్రోత్సహిస్తూ అండగా ఉన్న డాక్టర్.బండి సురేంద్రబాబు, సహచర పాత్రికేయ మిత్రులకి,స్వచ్ఛంద సేవకులకు, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావును ప్రముఖ జర్నలిస్ట్ సంఘాలు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు, గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.
జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావు
Related Posts
మంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…
Read moreప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట…
Read more