యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు
ప్రభాతదర్శిని, (యర్రగొండపాలెం-ప్రతినిధి):కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి చెడుగా మాట్లాడరని, నోరు ఉందికదా అని ఎలా పడితే ఆలా మాట్లాడితే ఊరుకోబోం – నోరుజారితే చట్టపరమైన చర్యలు తప్పవని యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్న క్యాంటీన్ల పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపి, చంద్రశేఖర్ తీరుపై ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్ లో అన్నం తినే పేదలను బిచ్చగాళ్ళతో పోల్చడం తాటిపర్తి చంద్రశేఖర్ కు సిగ్గుచేటు అనిపించలేదా అని ప్రశ్నించారు. అన్నం తినే ఎవరూ అన్నా క్యాంటీన్ గురించి హేళనగా మాట్లాడరని మరి చంద్రశేఖర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పేద ప్రజలకు క్షమాపణలు కోరాలని హెచ్చరించారు. గతంలో కూడా నోరు ఉంది కదా అని మీడియా సమావేశాలలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరబ్రహ్మ స్వరూమైన అన్నం పై మాట్లాడిన ఎవరు బాగుపడిన చరిత్ర లేదని తెలిపారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ది చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి హేళనగా మాట్లాడరు
Related Posts
14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…
Read moreఅమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…
Read more