ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే ప్రిస్కీల్లా గోల్డ్ మెడల్ అందుకున్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ఆత్మీయుల సమక్షంలో ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ ను అందుకున్నారు. పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, ఓజిలి గ్రామానికి చెందిన మంగళపూరి ప్రిస్కీల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ సాధించడం ద్వారా ఓజిలి మండలం కీర్తి ప్రతిష్టలు విద్యారంగంలో నిలిపారు. ఓజిలి గ్రామానికి చెందిన మంగళపూరి మనోహర్ రవికుమారి దంపతుల రెండవ కుమార్తె అయిన ప్రిస్కీల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి. చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకున్న ప్రిస్కీల్లా ఎల్కేజీ నుండి చదువులో చురుకైన విద్యార్థిని గా ఉపాధ్యాయుల చేత ప్రశంసలు పొందారు.ఆమె తల్లి రవికుమారి ప్రభుత్వం ఉపాధ్యాయురాలుగా, తండ్రి మనోహర్ ఫాస్టర్ గా పనిచేసేవారు. ప్రిస్కీల్లా తన విద్యాభ్యాసాన్ని ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో ఉన్న హరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఎల్కేజీ నుండి ప్రారంభమై సెకండ్ క్లాస్ వరకు కొనసాగింది. తరువాత 3వ తరగతి నుంచి 6 వరకు నాయుడుపేట లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనూ, 7వ తరగతి నుంచి 10 వరకు గూడూరు లోని ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొనసాగింది. చదువుల తల్లిగా పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రిస్కిల్లా 2013లో 9.2 జిపిఏతో పదో తరగతిలో ఉత్తీర్ణత అయింది. 2015 సంవత్సరంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లో బైపిసి గ్రూపు నుండి 91% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించారు. 2019 సంవత్సరంలో గూడూరు డి ఆర్ డబ్ల్యు మహిళ కళాశాలలో బిఎస్సి (బిబిసి) 9.06 జిపిఏతో ఉత్తీర్త సాధించారు. 2021 సంవత్సరంలో ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ) 9.83 జిపిఏ విక్రమ సింహపురి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టుగా రికార్డ్ పొంది బుధవారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రిస్కిల్లా తండ్రి మనోహర్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తండ్రి మరణంతో కుంగిపోకుండా తన సోదరుడైన ఫ్రాంక్లిన్ ఆమెలోని ప్రతిభాను చూసి, మరింతగా ప్రోత్సహించాడు. గత నెలలో తన అన్న ఫ్రాంక్లిన్, ప్రిస్కిల్లా కు కనీవినీ ఎరుగని రీతిలో వివాహం జరిపించారు. వివాహ సంబరంలో మునిగితేలుతున్న ఫ్రాంక్లిన్ కుటుంబం తన సోదరికి బయో టెక్నాలజీలో గోల్డ్ మెడల్ రావడం మరింత ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ప్రిస్కిల్లా కు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్ అందుకోవడంపై, పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే గోల్డ్ మెడల్ అందుకున్న ప్రిస్కీల్లా
Related Posts
బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read more14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…
Read more