ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వి.పి.ఆర్ విద్య పాఠశాల ద్వారా వందలాది మంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం చాలా సంతోషాన్నిస్తుందని వి.పి.ఆర్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరం సందర్భంగా వి.పి.ఆర్ విద్య పాఠశాలలో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె గురువారం పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకున్న ఆమె.. విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వి.పి.ఆర్ విద్య పాఠశాల ద్వారా వందలాదిమంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి, తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. పాఠశాల ఆవరణలోకి వస్తేనే తమకు ఉన్న ఒత్తిడి అంతా మర్చిపోతామన్నారు. వి.పి.ఆర్ విద్య పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 30 మంది పరీక్షలు రాస్తే 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. వారిలో 27 మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించడం గర్వంగా ఉంటుందన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులపై వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, దేశానికి మంచి సేవలు అందించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా 6వ తరగతికి ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఇంకా మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, షూస్, యూనిఫాం, ఇతర విద్యాసామాగ్రితో కూడిన కిట్లను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి, పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యను అందించడం సంతోషాన్నిస్తుంది…కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more