జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులు
మలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524
తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీ
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే జులై 19 నుండే తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. అర్హత పొందిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సిలింగ్ కోసం 1,28,619 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా, దృవీకరణ పత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. కోర్సుల ఎంపికలను 1,26,608 మంది పూర్తి చేసుకోగా, 44,69,203 ఎంపికలు నమోదు అయ్యాయని కన్వీనర్ పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 6877 సీట్లు ఉండగా, 6189 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 212 ప్రవేటు కళాశాలల్లో 1,21,951 సీట్లు ఉండగా, 1,03,247 భర్తీ అయ్యాయని, 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7832 సీట్లు ఉండగా, 7700 సీట్లు భర్తీ చేసామని తెలిపారు. మొత్తంగా 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, 19,524 సీట్లు మలివిడత కోసం ఉన్నాయని డాక్టర్ నవ్య వివరించారు. ఎన్ సిసి సంచాలకులు, శాఫ్ ఎండి నుండి తుది మెరిట్ జాబితా రానందున క్రీడా కోటా, ఎన్ సిసి కోటా సీట్లను భర్తీ చేయలేదని తదుపరి దశలో వీటిని భర్తీ చేస్తామని కన్వీనర్ స్పష్టం చేసారు.
ఇంజనీరంగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ:డాక్టర్ నవ్య
Related Posts
మంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…
Read moreప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట…
Read more