Sample Name

Senior Journalist

Sample Name

Reporter

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
June 9, 2023

Prabhathadarsini

Telugu News Channel

రాజ‌కీయాల్లో క్రిమిన‌ల్స్ సంఖ్య పెరిగుతుంది…           ప్ర‌జాప్ర‌తినిధుల క్రిమిన‌ల్ కేసుల‌పై ప్ర‌త్యేక ట్రిబ్యున‌ళ్లను ఏర్పాటు చేయాలి…రాజ‌కీయల్లోమార్పులు రావాలి… ఖాళీగా ఉండలేను….ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించున్నా… మాతృ భాష‌ల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన అవస‌రం ఉంది…మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

1 min read

రాజ‌కీయాల్లో క్రిమిన‌ల్స్ సంఖ్య పెరిగుతుంది…           ప్ర‌జాప్ర‌తినిధుల క్రిమిన‌ల్ కేసుల‌పై ప్ర‌త్యేక ట్రిబ్యున‌ళ్లను ఏర్పాటు చేయాలి…రాజ‌కీయల్లోమార్పులు రావాలి… ఖాళీగా ఉండలేను….ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించున్నా… మాతృ భాష‌ల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన అవస‌రం ఉంది…మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు   ప్రభాతదర్శిని, న్యూఢిల్లీ-ప్రతినిధి: రాజ‌కీయాల్లో క్రిమిన‌ల్స్ సంఖ్య పెరిగుతుందని, ప్ర‌జాప్ర‌తినిధుల క్రిమిన‌ల్ కేసుల‌పై ప్ర‌త్యేక ట్రిబ్యున‌ళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన విలేకరుల ఇష్టాగోష్ఠీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజ‌కీయల్లో మార్పులు రావాలని రాజ‌కీయాల్లో క్రిమిన‌ల్ చ‌రిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోందని, ఇది స్వ‌చ్ఛ రాజ‌కీయాల‌కు మంచిది కాదన్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల క్రిమిన‌ల్ కేసుల‌పై ప్ర‌త్యేక ట్రిబ్యున‌ళ్లను ఏర్పాటు చేసి, నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో వాటి విచార‌ణ‌ను ముగించాలన్నారు.  చట్ట స‌భల్లో 33 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యం తీసుకోవాలని సూచించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వెంటనే ఆమోదించాల్సిన అవ‌స‌రం ఉందని, దీన్ని సాగ‌దీయడం ఎంత‌మాత్రం స‌బ‌బు కాదన్నారు.దేశంలోని రాజ‌కీయ‌, సామాజిక‌, సాంస్కృతిక, జీవన స్థితిగ‌తుల్లో మార్పులు రావాలని వెంకయ్య చెప్పారు. సుదీర్ఘ‌ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వంతో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత‌ ఖాళీగా ఉండలేనన్నారు. విద్య‌, మ‌హిళ‌, రాజకీయ‌, భాష‌,.సాంస్కృతిక అంశాల్లాంటివి పదింటిని గుర్తించానని, వాటిపై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాజ‌కీయాల గురించి మాట్లాడుతా కానీ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. రాజ‌కీయ నాయ‌కులు వాడే ప‌ద‌జాలం ఆవేద‌న కలిగిస్తోందని, రాజకీయాల్లో అసభ్య ప‌ద‌జాలాన్ని నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. గ‌తంలో రాజ‌కీయాలు బాగుండేవని ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాష‌ల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన అవస‌రం ఉందని, లేక‌పోతే కొన్ని రోజుల‌కు భాష‌లు అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని భార‌తీయ భాష‌ల‌కు స‌మాన ప్రాధ‌న్య‌త ల‌భించాలన్నారు. అన‌వ‌స‌ర‌మైన ఉచితాలు కూడా మంచిది కాదని, ప్ర‌జా సంక్షేమం నిర్మాణాత్మ‌కంగా ఉండాలన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో కూడా కొన్ని మార్పులు రావ‌ల్సిన అవ‌స‌రం ఉందని, ఏళ్ల కొద్దీ కేసులను సాగతీయడం సబబు కాదని వెంకయ్య చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *